కాంగ్రెస్, బీజేపీలది చీకటి ఒప్పందం- మంత్రి జగదీశ్ రెడ్డి

140
minister jagadish reddy
- Advertisement -

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు..వారి మాటలు ఆ పార్టీల, తెలంగాణ ప్రజల దురదృష్టం అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎంను దేశ ద్రోహి అని దిగజారి మాట్లాడుతున్నారు.ఆ మాటకు అర్థం తెలుసా అని మంత్రి ప్రశ్నించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 150 డివిజన్లలో టిఆర్ఎస్ పోటీ చేస్తోంది..మాకు ఎవరితో పొత్తు లేదు,తెలంగాణ ప్రజలతోనే మా పొత్తు అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ లదే చీకటి ఒప్పందం..టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రతి ఎన్నికలో బీజేపీకి సహకరిస్తోంది..నిజామాబాద్, కరీంనగర్, దుబ్బాకలో ఒకరికొకరు సహకరించుకున్నారు. వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తున్నాయి..వరద సహాయం నిలిపేయాలని బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు లేఖ రాసాయి..ఇప్పుడు మేము చెప్పలేదని డ్రామాలాడుతున్నారు..ప్రజల మీద ప్రేముంటే వరద సహాయం అందించాలని మరో లేఖ రాయాల్సింది అని మంత్రి విమర్శించారు.

గుజరాత్, యూపీలో చలాన్ లు బీజేపీ ప్రభుత్వాలే కడుతున్నాయా ?..తప్పుచేసిన వారికి చలాన్ లు వేస్తారు. తప్పులను మీరు ప్రోత్సహిస్తున్నారా,నేరస్తులకు బీజేపీ అండగా ఉంటుందా ? అని మంత్రి ప్రశ్నించారు. హైద్రాబాద్ నగర అభివృద్ధి మీద చర్చకు మేము సిద్ధం.గుడి కైనా ,బడి కైనా వస్తాం..తిట్లు, వొట్లతో ఓట్లు రావు అన్నారు.కేసీఆర్ ను ఉగ్రవాది, దేశ ద్రోహి అన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రా, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలన్నీ మీ వద్దే ఉన్నాయి..ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు.

అసదుద్దీన్‌తో మోడీ ఎందుకు సమావేశమయ్యారో బండి సంజయ్ సమాధానం చెప్పాలి.ఎంఐఎం ఉగ్రవాద సంస్థ అయితే మోడీ ఎందుకు భేటీ అయ్యారు?.. దేవుళ్ల పేరుతో ఓట్లు అడుక్కోవడం బీజేపీకి అలవాటు. జీహెచ్‌ఎంసీలో వంద సీట్లకు పైనే గెలుస్తాం..సొంతగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామన్నారు. కేసీఆర్ హైదరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నారు. బండి సంజయ్ తన లేఖ ఫోర్జరీ అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళాలి..గుడికి కాదు. దుబ్బాకలో అప్రమత్తం గా లేకే ఓడాం. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం అని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -