మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి..

235
Minister jagadish reddy
- Advertisement -

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ,వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్, మున్సిపల్ కమిషనర్ మరియు టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. చెట్లను నాటడం వాటిని సంరక్షించడం ఉద్యమ తరహాలో చేపట్టాలని సూచించారు. కాలుష్యం బాగా పెరిగి కొత్త కొత్త వ్యాధులు,క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నామన్నారు. చెట్లను పెంచడం,అడవులను సంరక్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి.

- Advertisement -