కల్నల్ సంతోష్‌ బాబుకి మంత్రి జగదీష్ నివాళి…

296
jagadish reddy
- Advertisement -

చైనాతో ఘర్షణల్లో అమరుడైన సంతోష్ బాబుకు నివాళి అర్పించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభంకానుండగా ఉదయం నుండే పెద్ద ఎత్తున ప్రజలు సంతోష్ పార్థీవ దేహనికి నివాళలు అర్పించేందుకు సంతోష్ బాబు ఇంటికి చేరుకున్నారు.

ఇక మంత్రి జగదీష్ రెడ్డి సంతోష్ బాబుకు నివాళి అర్పించారు.సంతోష్ అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొననున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు

సంతోష్ బాబూ ఇంటి పరిసరాలను ప్రతి అరగంట కు ఒకసారి శానిటేషన్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది. కేసారం గ్రామంలోని సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాల ప్రకారం ,కోవిడ్ నిబంధనలు కు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు ఆర్మీ అధికారులు.

- Advertisement -