నల్లగొండ పట్టణంపై ఆయనది చెరగని ముద్ర..

76
jaga
- Advertisement -

సీనియర్ టీఆర్ఎస్ నేత చిలుకల గోవర్ధన్ అకస్మాత్తుగా మరణించడం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన లైన్స్ క్లబ్,వాసవి సేవా సమితిల కార్యక్రమాల ద్వారా ప్రజాసమూహానికి చేరువైన నాయకుడు గోవర్ధన్ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

తన అమెరికా పర్యటనలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణా సమాజం అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారని ఆయన చెప్పారు.నిబద్ధత,నిజాయితీ,ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నిర్మొహమాటంగా వ్యవహరించడం అన్నది సొంతం చేసుకున్న గోవర్ధన్ నల్లగొండ జిల్లా ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని ఆయన తెలిపారు.అంతే గాకుండా వర్తమాన రాజకీయాలకు చిలుకల గోవర్ధన్ జీవితం ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడుతుందన్నారు.

- Advertisement -