రైతు వేదికలతో మార్పులకు శ్రీకారం: జగదీష్ రెడ్డి

173
jaga
- Advertisement -

రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రామన్నపేట మండలంలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన ఆయన రైతు వేదికలు వ్యవసాయ చరిత్రలో పెను మార్పులకు శ్రీకారం చుడతాయన్నారు.

రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతుబంధు సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతు సంక్షేమానికి పాటుపడుతున్నారని తెలిపారు. రైతు వేదికల ద్వారా రైతులు అన్ని విషయాలపై చర్చలు జరుపుకుని, పంటలు వేస్తూ లాభాలు గడించాలని మంత్రి పిలునిచ్చారు.

అనంతరం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ లింగయ్య యాదవ్, కలెక్టర్ అనితా రాంచంద్రన్ లతో కలిసి రామన్నపేట మండల కేంద్రంలో వెటర్నరీ హాస్పిటల్ కు భూమి పూజ చేసి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆరో విడత హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు.

- Advertisement -