అభివృద్ధిలో పరుగులు పెడుతున్న హుజుర్‌నగర్‌:జగదీష్ రెడ్డి

171
jagadish
- Advertisement -

అభివృద్ధిలో హుజుర్‌నగర్ పరుగులు పెడుతోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యపేట జిల్లా మట్టంపల్లి మండలం వద్ద ఏపీ,తెలంగాణ మధ్య రాకపోకల కోసం కృష్ణానదిపై నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు జగదీష్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి … కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం తో ఇక్కడి వారి కష్టాలు అన్నితొలగిపోయాయని చెప్పారు.ప్రశాంత్ రెడ్డి సహకారంతో రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేశామన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు లను కడుతున్నారని…. అందులో భాగమే కాళేశ్వరం నిర్మాణం అన్నారు.

సాగర్ ఆయకట్టు కింద రెండు కార్లకు నిరందిస్తున్నాం…రైతు వేదికల నిర్మాణం తలమానికంగా నిలుస్తాయన్నారు.రైతుల తల రాతలు మార్చే విధంగా నియంత్రిత పంటల సాగుకు శ్రీకారం చుట్టామని…….హుజుర్నగర్ నియోజకవర్గంలో సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలను అన్నిటిని 100 శాతం నెరవేర్చామన్నారు.

- Advertisement -