కాంగ్రెస్,బీజేపీలను తరిమికొట్టాలి: హరీశ్‌ రావు

209
harish rao
- Advertisement -

దుబ్బాక ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి హరీశ్‌ రావు. టీఆర్ఎస్ ప్రభుత్వం లో వలస వెళ్లిన వాళ్ళు వాపస్ వస్తున్నారని చెప్పారు. కేంద్ర బిల్లులకి వ్యతిరేకంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా టీ ఆర్ ఎస్ ఉద్యమం చేస్తుందన్నారు.కాంగ్రెస్ వాళ్ళకి పరాయి లీడర్లు,కిరాయి మనుషులు ….పక్క జిల్లాల నుండి మనుషులను తెచ్చుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు ఉండగా తిన్నది అరగక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని బీజేపీ వాళ్ళు అన్నారు…వ్యవసాయం దండగా అని కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు బండారు దత్తాత్రేయ అన్నారు…కాలిపోయే మోటారులు కావాలా, బావి దగ్గర మీటర్లు కావాలా, 24 గంటలు కరెంట్ కావాలా తేల్చుకోవాలన్నారు హరీశ్‌ రావు.

27ఏప్రిల్ 2020 నాడు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లు తెచ్చింది…17 మే సబ్సిడీ లేకుండా బిల్లు ఇవ్వాలి అని కేంద్రం రాష్ట్రానికి లెటర్ రాసింది…బావి ల దగ్గర మీటర్లు పెడితే 2500 కోట్లు ఇస్తామన్నారు….జూన్ 2న మీటర్లు పెట్టము అని సీఎం కేంద్రానికి లెటర్ రాశారని తెలిపారు.మీటర్లు వద్దు అంటే 300 మీటర్ల లోతు లో బీజేపీ ని పాతి పెట్టాలి…. అబద్ధాల పునాదుల మీద బీజేపీ , కాంగ్రెస్ లు ఓట్లు పొందాలని చూస్తున్నారని చెప్పారు.

- Advertisement -