పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ..

173
minister puvvada
- Advertisement -

ఆదివారం ఖమ్మం జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ 5వ డివిజన్ మెయిన్ రోడ్ నుండి ఖానాపురం వరకు రూ.4 కోట్లతో నిర్మించిన రోడ్డు విస్తరణ, కాల్వ పనులు, కాల్వర్ట్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ మరియు సెంట్రల్ డివైడర్ లను మేయర్ పాపాలాల్ తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

తొలుత తెలంగాణ తల్లి విగ్రహం నుండి ఖానాపురం వరకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా మంత్రి పువ్వాడకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

- Advertisement -