వర్టికల్ గార్డెన్‌ను ప్రారంభించిన మంత్రి అల్లోల..

239
- Advertisement -

నిర్మ‌ల్ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రేక్ష‌కుల గ్యాల‌రీలో 60 వేల మొక్క‌ల‌తో ఏర్పాటు చేసిన వ‌ర్టిక‌ల్ గార్డెన్ ను,మ‌న నిర్మ‌ల్ లోగోను మంత్రి అల్లోల ఇంద్రకరన్‌ రెడ్డి ప్రారంభించారు. వర్టికల్ గార్డెన్ వల్ల స్టేడియానికి, ప‌ట్ట‌ణానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ వ‌చ్చింద‌ని మంత్రి తెలిపారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేయ‌డంతో పాటు సుందరీకరణ అద్భుతమైన రీతిలో ఉండేలా కృషి చేస్తున్నామ‌న్నారు.

మున్సిప‌ల్ శాఖ అద్వ‌ర్యంలో కేటీఆర్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌ష‌న్స్..

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జ‌న్మదిన వేడుక‌ల‌ను నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గంలో మున్సిప‌ల్ శాఖ అద్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వ‌హించిన ఈ వేడుక‌ల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొని కేక్ క‌ట్ చేశారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా అట‌వీశాఖ ఆధ్వర్యంలో కొండాపూర్ స‌మీపంలో జాతీయ ర‌హ‌దారికి ఇరువైపులా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆధ్వర్యంలో 3 ల‌క్షల మొక్కలు నాటారు. ఈ వేడుక‌ల్లో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డితోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యక‌ర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… భవిష్యత్‌ తరాలకు పచ్చదనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రాభివృద్ధితోపాటు భవిష్యత్‌ తరాలకు పచ్చదనాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం భారీ వ‌ర్షాల ముంపుకు గురైన బాధితుల‌కు విజ‌య డైరీ ఆద్వ‌ర్యంలో 300 పాల ప్యాకెట్ల‌ను పంపిణీ చేసే కార్య‌క్ర‌మాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు.

- Advertisement -