సాయన్న మరణం తీరనిలోటు..

26
- Advertisement -

సాయన్న మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.అనారోగ్యంతో కన్నుమూసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఇంద్రకరణ్..సాయన్న ప్రజాదరణ కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయన మరణవార్త తనని కలచివేసిందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నఎమ్మెల్యే జీ సాయన్న (72) ఫిబ్రవరి 19న కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మారేడుపల్లిలోని హిందూ శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ తరఫున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన సాయన్న 2009లో ఓటమి చెందారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన సాయన్న 2018 ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -