నిర్మల్‌కు కొత్త శోభ- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

165
ik reddy
- Advertisement -

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మూడు ప్రాంతాల్లో హైమాస్ట్ లైట్లను శనివారం రాత్రి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. శివాజీ చౌక్‌లో రెండు, మినీ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట, గాజుల్ పెట్ వెళ్లే రహదారిపై ఏర్పాటు చేసిన లైట్లను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక ప్రగతి పనులతో నిర్మల్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నిర్మల్ పట్టణ అభివృద్ధి ని చూసి దూరప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న వారు సైతం ఆనందపడుతున్నారని తెలిపారు..పట్టణంలోని 14 జంక్షన్ లలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లతో నిర్మల్ పట్టణం కు కొత్త శోభ సంతరించుకుందని తెలిపారు.

- Advertisement -