ఆటోమెటెడ్‌ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించిన మంత్రి..

172
Minister Satyavathi Rathod
- Advertisement -

రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆటోమెటెడ్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ వీపీగౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో పట్టణంలోని జంక్షన్లన్నీంటిలో ఆటోమెటెడ్‌ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్త జిల్లాల ప్రతిఫలాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని మంత్రి తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నియంత్రణకు సహకరించాలన్నారు. ఆటోమెటెడ్‌ సిగ్నల్స్‌పై వాహనదారుల్లో అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు.మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రూ.50 కోట్ల నిధులిచ్చారని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

- Advertisement -