మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

59
ik reddy
- Advertisement -

సామూహిక హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇవాళ ఒక్కరోజే 75 లక్షల మొక్కలు నాటుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌ బొటానికల్‌ గార్డెన్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

గతంలో న్యాయవివాదంలో ఉన్న బొటానికల్ గార్డెన్ సమస్యను సీఎం కేసీఆర్ చొరవతో పరిష్కరించుకున్నామని, ఇప్పుడు దానిని దేశంలోనే అద్భుతమైన అర్బన్ ఫారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

- Advertisement -