ఆరోగ్య సూచీల్లో మొదటి స్థానం చేరాలి: హరీష్‌

31
harishrao
- Advertisement -

ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలని వైద్యారోగ్య సిబ్బంది, అధికారులకు సూచించారు మంత్రి హరీష్ రావు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నఆశాలు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, డీహెచ్‌ శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సబ్‌ సెంటర్‌, పీహెచ్‌సీల వారీగా పురోగతి పై సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్నామని గుర్తు చేస్తూ..ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపు. ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ గారు వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. రూ. 11,237 కోట్లతొ గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేశారన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నూతనోత్సాహంతో పని చేయాలని తెలిపారు.

ఆశా, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్లతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏఎన్‌సీ చెకప్స్‌, డెలివరీలు, ఎన్‌సీడీ ప్రోగ్రాం, వ్యాక్సినేషన్‌ తదితర కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత సహా మరేఇతర ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. ప్రభుత్వ కృషికి తోడు ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతతో సహకరించాలి. అందరం కలిసి పని చేయడం వల్ల ఎంఎంఆర్‌ సూచీలో తమిళనాడును అధిగమించి దేశంలో రెండో స్థానానికి చేరుకున్నాం. ఇంతటితో ఆగకుండా మొదటి స్థానానికి చేరడమే మన లక్ష్యం, ఇతర పారామీటర్లలో కూడా పురోగతి నమోదు చేయాలన్నారు

మంచి పనితీరు కనబర్చిన డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీ వైద్యులు, ఆశాలు, ఏఎన్‌ఎంలకు ఈనెల 7న వరల్డ్‌ హెల్త్‌ డే పురస్కరించుకొని నగదు ప్రోత్సాహంతో పాటు సన్మానం ఉంటుంది. ప్ర‌తి విభాగంలో ముగ్గురిని ఎంపిక చేసి స‌న్మానిస్తాము. ఇక‌పై ప్ర‌తి మూడు నెలలకొకసారి ఇలాంటి కార్య‌క్ర‌మం ఉంటుంది. అదే స‌మ‌యంలో.. పని చేయని వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.

- Advertisement -