అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు పెంపు!

190
harishrao
- Advertisement -

కొవిడ్, లాక్ డౌన్ నేపధ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోత విధిస్తూ ఆర్ఢినెన్స్ తెచ్చుకున్నాం. దాన్ని ఇప్పుడు చట్టంగా మార్చేందుకు సభ మందుకు తెస్తున్నాం అన్నారు మంత్రి హరీశ్‌ రావు. శాసన సభలో తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీ బిల్ – 2020ని ప్రవేశపెట్టారు హరీశ్ రావు.

ఈ సందర్భంగా ఏప్రిల్ నెలలో రాష్ట్ర సొంత ఆదాయం 577 కోట్లు మాత్రమే రావడం జరిగింది.ప్రజాప్రతినిధులు , ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ చెల్లింపులు పోస్ట్ పోన్ చేశాం. రాబోయే రోజుల్లో చెల్లంచాలన్న ఉద్దేశంతో ఈ ఆర్డినెన్స్ తెచ్చుకోవడం జరిగింది.ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం చెల్లింపులు పోస్ట్ పోన్ చేశాం.బడ్జెట్ లో పెట్టుకున్న ఐదు నెలల 75 వేల 125 కోట్లు రావాల్సి ఉంటే 49 వేల 131 కోట్లు మాత్రమే రావడం జరిగింది.స్టేట్ ఓన్ రెవెన్యూ 7 వేల 850 కోట్లు రూపాయలు కరోనా నేపధ్యంలో తగ్గింది. సభ లేకపోవడం వల్ల ఆ సమయంలో ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం.ఎప్పటిలోగా వేతనాలు ఇచ్చేది సీఎంగారి పరిశీలనలో ఉంది. అతి త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.ఈ బిల్లుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి ఎం.ఐ.ఎం., కాంగ్రెస్.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పని చేస్తున్న అధ్యాపకుల పదవీవిరమణ వయసును 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అదే రీతిలో ప్రభుత్వ ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి మెడికల్ కాలేజీలో పని చేసే అధ్యాపకుల పదవీవిరమణ వయసును 58 నుంచి 65కు పెంచుతూ ఈ బిల్లును తీసుకువస్తున్నాం.చాలా మంది అధ్యాపకులు పదవీ విరమణ చేసే వారు ఉన్నారు. సరైన నిపుణులు దొరకడం లేదు.ఈ కారణంగా అనుభవజ్ఞులైన వీరి సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 52 మంది ఫ్రోఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రోఫెసర్ల సేవలు వినియోగించుకునే వెసులు బాటు కలుగుతుంది.

రిక్రూట్ మెంట్ పై కేసులు పడి స్టేలున్నాయి. ఉన్నటువంటి అధ్యాపకులు రిటైర్ అవుతున్నారు. ఈ కారణం వల్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతీఏడాది తగిన వసతులు, అధ్యాపకులు ఉన్నారా లేదని పరిశీలించి సీట్లుకేటాయిస్తుంది. సీట్లు కోల్పోకుండాఉండకుండా, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు టీచింగ్ స్టాఫ్ కు మాత్రమే పదవీ విరమణ వయోపరిమితి పెచండం జరుగుతుంది. నాన్ టీచింగ్ స్ఠాఫ్ కు పెంచడం లేదు. దీనివల్ల కేవలం 52 మందికి మాత్రమే పదవీ విరమణ వయసును పెంచడం జరుగుతుందని ఎమ్మెల్యేసీతక్క అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు.ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

- Advertisement -