ఢిల్లీలో మెచ్చుకుంటారు…గల్లీలో అడ్డుపడతారు..!

80
harish
- Advertisement -

ఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీలో రోడ్డుకు అడ్డం పడుతారని బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు. రూ. 150 కోట్లతో నిర్మించిన ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని, రేడియాలజీ ల్యాబ్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, రేఖా నాయక్‌తో కలిసి ప్రారంభించారు మంత్రి హరీష్ రావు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు….ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దీని నిర్వహణ కోసం ఏడాదికి రాష్ట్రం 50 కోట్లు ఖర్చు చేయనుందని….నిర్మల్, అదిలాబాద్ లో ఉదయం నుండి అందరం పర్యటన చేస్తున్నాం. కొత్త ఆసుపత్రులకు శంకుస్థాపన, సిద్దంగా ఉన్నవాటిని ప్రారంభించుకుంటున్నం అన్నారు.

దేశంలో తెలంగాణ బెస్ట్ అని నీతి ఆయోగ్ చెప్పింది… కరోనా కట్టడిలో బాగా పని చేశామని హై కోర్టు స్పష్టం చేసింది. హైదారాబాద్ లో 350 బస్తీ దవాఖానలు బాగా పని చేస్తున్నాయని 15 వ ఆర్థిక సంఘం చెప్పింది. తెలంగాణలో పేదలకు అద్భుత వైద్యం అందిస్తున్న మూడో రాష్ట్రం తెలంగాణ అని రాజ్య సభలో కేంద్రం చెప్పింది. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ చిట్ట చివరి స్థానంలో ఉందని చెప్పిందన్నారు.

- Advertisement -