సిద్ధాంతం లేని రాద్దాంతపు పార్టీ బీజేపీ:హరీశ్‌ ధ్వజం

178
harishrao
- Advertisement -

సిద్దాంతం లేని రాద్దాంతపు పార్టీ బీజేపీ అని మండిపడ్డారు మంత్రి హరీశ్‌ రావు. పఠాన్‌చెరులో టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడిన హరీశ్…కాంగ్రెస్‌, బీజేపీలపై ద్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు‌ తెలంగాణ ప్రజలకు చేసిందేంటో చెప్పాలని ప్రశ్నించారు.

కరోనా వస్తే ఇళ్లలో ఉన్నది కాంగ్రెస్, బీజేపీ నేతలేనని…కరోనా కష్టకాలంలో ప్రజల్లో ఉన్నది తాము కదా అని తెలిపారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుందని… బీజేపీ‌ వ్యవహార శైలిని తెరాస కార్యకర్తలు‌ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

బీజేపీ కరోనా తో కూడా‌ రాజకీయాలు చేస్తోందని… బీహార్ ఎన్నికలలో గెలవడానికి అక్కడి ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ప్రచారం చేసిందని గుర్తుచేశారు. ఎన్నికలంటేనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయని… కానీ ఆ పార్టీలు ఏం చేసాయని ఓట్లు‌ వేయాలన్నారు. 70‌ ఏళ్ప కాంగ్రెస్ , బీజేపీ పాలనలో పఠాన్ చెర్వు కు కనీసం మంచి‌ నీళ్లు‌ ఇవ్వలేదని దుయ్యబట్టారు.

- Advertisement -