సీఎం కేసీఆర్‌కు కానుకగా హుజురాబాద్..

114
huzurabad
- Advertisement -

హుజురాబాద్ అభివృద్ధి బాధ్యత తనదేనని తెలిపారు మంత్రి హరీష్ రావు. సింగాపూర్ దేశాయిపల్లిలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు..నిరంతరం ప్రజల కోసం పని చేసే‌ సీఎం కేసీఆర్‌కు.. ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గెలుపును కానుకగా ఇద్దాం అన్నారు.

యాసంగిలో‌ 3 కోట్ల మెట్రిక్‌టన్నుల‌వరి పంట పండించి ‌తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచిందన్నారు. ఇది‌ సీఎం‌ కేసీఆర్ దూరదృష్టి, ప్రణాళిక వల్లే సాధ్యమైందన్న ఆయన.. ఇది అవుతుందా అన్న కాళేశ్వరం ప్రాజెక్టు ‌రికార్డ్ సమయంలో పూర్తి చేసి రైతన్నకు సాగు నీటి‌కొరత లేకుండా‌ చేశారన్నారు.

అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండేలా పని చేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులను బలపరుద్దాం.. కులవృత్తులను బలో పేతం‌చేసేలా‌ సీఎం‌ కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఒకప్పుడు తెలంగాణ అంటే ఆత్మహత్యలు, ఆకలి కేకలు, వలసలు ఉండేవి.. ఇప్పుడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అన్నారు. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా అన్నారు.

- Advertisement -