బీజేపీవి ఓట్ల రాజకీయాలు: మంత్రి హరీష్ రావు

144
harishrao
- Advertisement -

మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండల కేంద్రం లో టిఆర్ఎస్ మద్దతు గా చేగుంట, నార్సింగి మండలాల వర్తక, వాణిజ్య, రైస్ మిల్లర్లు సమావేశం నిర్వహించారు మంత్రి హరీష్ రావు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా, అభ్యర్థి సోలిపేట సుజాత పాల్గొన్నారు.

డబుల్ ఇంజన్ గ్రోత్ జరగాలంటే టీఆర్ఎస్ కే ఓటు వేయాలన్నారు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం నుండి జీఎస్టీ ద్వారా 18 వేలు కడితే…మనకు 3 వేల కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్రం 11వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రనికి ఇవ్వాలన్నారు.

తెలంగాణ కు హక్కుగా రావలసిన నిధులు కుడా కేంద్రం ఇవ్వడం లేదు.బీహార్ లో ఓట్ల కోసం కరోన వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ చెబుతుంది… తెలంగాణ లో కరోన పెషంట్లు లేరా… తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వరా.బీజేపీ ఓట్ల కోసం అసత్యాలు ప్రచారం చేస్తుంది.వర్తక, వ్యాపారుల కోసం చేగుంట లో భవనం నిర్మిస్తామన్నారు.

- Advertisement -