పీవీకి మంత్రి హరీష్ నివాళి…

199
PV Narasimha Rao
- Advertisement -

తెలంగాణ ముద్దుబిడ్డ,దేశంలో ఆర్ధిక సంస్కరణల సృష్టికర్త పీవీ నరసింహరావు శతజయంతి నేడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజకీయాలకు అతీతంగా విషెస్ చెబుతున్నారు.

ఇక పీవీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహారావు. ఆలోచనాపరునిగా, సాహితీవేత్తగా, బహుభాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ ఆమోఘం, అనితర సాధ్యం అని పేర్కొన్నారు హరీష్‌.

ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతదేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఆ మహనీయుని శతజయంతి ఉత్సవం మొదలైన సందర్భంగా తెలంగాణ ఠీవీ పీవీని ఘనంగా స్మరించుకుందాం. ఘన నివాళులు అర్పిద్దాం అని తెలిపారు.

- Advertisement -