పీవీకి హరీష్,కవిత నివాళి

190
mlc
- Advertisement -

ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు శ‌త‌జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా నివాళి అర్పించారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత, మంత్రి హరీష్ రావు. ఆర్థిక సంస్కరణలతో దేశ సమగ్రాభివృద్ధికి బాటలు వేసి,పారిశ్రామిక రంగంలో,పల్లెల‌ స్థితిగతుల్లో సమూలంగా మార్పులు తెచ్చిన గొప్ప వ్యక్తి తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని మన పీవీ నరసింహారావు. వారి సేవలను స్మరిస్తూ,శతజయంతి సందర్భంగా తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు గారికి ఘన నివాళులు ఆర్పిస్తున్న‌ట్లు క‌విత ట్వీట్‌లో పేర్కొన్నారు.

తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహా రావు… ఆలోచనాపరునిగా, సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ అమోఘం, అనితర సాధ్యం అని పేర్కొన్నారు హరీష్ రావు. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారత దేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఆ మహానీయుని శతజయంతి సందర్భంగా తెలంగాణ ఠీవీ.. మన పీవీని ఘనంగా స్మరించుకుందాం. ఘన నివాళులు అర్పిద్దాం’ అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

- Advertisement -