వాళ్లది శూనకానందం: హరీష్ రావు

223
harish
- Advertisement -

తాను అనని మాటలను కొందరు వక్రీరించ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన హరీష్ రావు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మింగుడుపడక కొందరు అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని అన్నారు.

సంగారెడ్డి జిల్లాలో లక్షా 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని, ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇందుకోసం కోటి 10లక్షల రూపాయలు రైతులకు చెల్లించామని వెల్లడించారు. పంట కొనుగోలు పూర్తయిన చోట కేంద్రాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలేమీ తెలుసుకోకుండా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.

సంగారెడ్డిలో బుధవారం తాను మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేసి కొందరు సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారని …ఈ సందర్భంగా తాను మాట్లాడిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు.

- Advertisement -