కేసీఆర్ ప్రభుత్వం పేదల పక్షపాతి: హరీశ్ రావు

74
harish rao
- Advertisement -

సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు మంత్రి హరీశ్ రావు. అనాథలు, అభాగ్యులు రోడ్లపై తిరుగుతూ జీవనం సాగిస్తున్న వారి కోసం ప్రభుత్వం రాత్రి బస కేంద్రం (నైట్‌షెల్టర్‌)ను ఏర్పాటు చేసిందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మణికంఠ నగర్‌లో మెప్మా-డీఏవై-ఎన్ యూఎల్ఏం- ఆధ్వర్యంలో రూ.72.82 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పట్టణ నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

సమాజంలోని ఏ ఒక్క పేదలూ ఆకలితో అలమటించకూడదని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నైట్ షెల్టర్ లో అనాథలకు ప్రతిరోజు ఉచితంగా టిఫిన్, భోజనం, బెడ్, లాకర్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రంలో సేద తీరుతున్న పేదల పట్ల సామాజిక సృహతో వ్యవహరించాలని నిర్వాహకులను మంత్రి కోరారు.

- Advertisement -