- Advertisement -
సిద్దిపేటలో భోజనామృతం కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. రైతు బజారులో హరేరామ హరేకృష్ణ సంస్ధ ఆధ్వర్యంలో రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు స్వయంగా భోజనం వడ్డించారు హరీష్.
అంతకముందు రైతులతో మాట్లాడిన హరీష్ పంటలకు గిట్టుబాటు ధర వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. ఏ పంటలు ఏ సమయంలో పండించాలో తెలుసుకోవాలని..వేసవి సమయంలో కూరగాయలకు అధిక ధర ఉంటుందని వాటిని పండించాలని సూచించారు.
వేసవిలో టమాట పంటను పండించాలని ఇందుకు అవసరమైన షెడ్డుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. రైతు బజారును పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఇక భోజనామృతంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించారు. స్టీల్ ప్లేట్లు, గ్లాసులు మాత్రమే వాడనున్నారు.
- Advertisement -