మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు: హరీష్‌ రావు

177
minister harishrao
- Advertisement -

మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మహిళా సంఘాల సమావేశం జరుగగా మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీలేని రుణాలు మీ ఖాతాల్లో రేపటి నుంచి జమ చేస్తున్నాం అన్నారు. 2.34 కోట్ల వడ్డీలేని బ్యాంక్ లింకేజీ రుణాలు జమ్మికుంట మహిళ సంఘాలకు అందిస్తున్నాం అన్నారు హరీష్ రావు.

స్త్రీ నిధి పథకంలో వడ్డీలేని రుణం కింద కోటి 84 లక్షలు మీ ఖాతాల్లో జమచేస్తున్నాం అని తెలిపిన హరీష్ రావు….ఇవి కాకుండా కొత్తగా 10 కోట్ల బ్యాంకు లింకేజీ, మరో కోటి రూపాయలు స్త్రీనిధి కింద లోన్లు మంజూరు చేస్తున్నాం అన్నారు. తెలంగాణ వచ్చాక మహిళలకు 5 లక్షల పైన రుణాలు సకాలంలో అందిస్తున్నాం.. మైక్రోఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల బెడద లేకుండా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తోంది ప్రభుత్వం అన్నారు. వడ్డీలేని రుణం కింద రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసేందుకు బడ్జెట్ లో 3 వేల కోట్లు పెట్టాం అని తెలిపిన హరీష్‌ రావు…ప్రభుత్వం ఏ లబ్ధి అందించినా.. మహిళల పేర్లపైనే ఇస్తున్నాం అన్నారు. కల్యాణలక్ష్మి పథకం మొదట్లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చాం. ఇప్పుడు అన్ని కులాల్లోని నిరుపేదలకు రూ. లక్షా 116 ఇస్తున్నాం అన్నారు.

కల్యాణ లక్ష్మి డబ్బులు అత్తవారికి చెందకుండా.. వధువు తల్లిపేరుతో ఇస్తున్నాం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు.. మగపిల్లాడు పుడితే 12 వేలు, ఆడపిల్ల పుడితే 13 వేలతోపాటు, కేసీఆర్ కిట్టు అందిస్తున్నాం అని తెలిపిన హరీష్…టీడీపీ, బీజేపీ పొత్తుల ప్రభుత్వం నడిపినప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే భయపడేవారన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే… పాటను నేడు.. “నేను పోతా సర్కారు దవాఖానకు” అనేలా మార్చాం అన్నారు.

57 ఏళ్లు నిండిన వాళ్లకు ఫించను ఇస్తామన్న హామీ కరోనా వల్ల ఆలశ్యమైంది. ఇచ్చిన మాట ప్రకారం 1-2 నెలల్లోనే అందరికీ ఇస్తాం అన్నారు. ఆసరా ఫించను పుణ్యామా అని కోడళ్లు అత్తలను బాగా చూసుకుంటున్నారు. అత్తలే .. కోడళ్లకు ఆసరాగా మారారని వెల్లడించారు. తెలంగాణ రాకముందు కరెంటు, సాగునీటి పరిస్థితి ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందన్నది మీకు తెలుసు అన్నారు. వారం, పది రోజుల్లాగా.. 50 వేల వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేస్తున్నాం అన్నారు. మార్చి తర్వాత లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ వడ్డీతో సహా మాఫీ చేస్తాం అన్నారు.

- Advertisement -