ఫీవర్ సర్వే ..పరిశీలించిన మంత్రి హరీష్ రావు

44
harishrao
- Advertisement -

పటాన్ చెరువు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా లో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వేను ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100% ఫీవర్ సర్వే పూర్తవుతుందని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి హోం ఇసోలేషన్ కిట్లు అందించడంతోపాటు, పరిస్థితి తీవ్రతను బట్టి ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే తీరును వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -