బీజేపీకి తెలంగాణలో ఏం పని : మంత్రి హరీశ్

155
harish
- Advertisement -

.రైతుల ఉసురు పోసుకునే ప్రభుత్వం కేంద్రానిదైతే.. రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం తెలంగాణది అన్నారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ ప్రభుత్వం బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల నుంచి కరెంటు బిల్లు వసూలు చేయాలంటోంది…. సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారని అన్నారు.

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్, మనెమ్మ గడ్డ, లచ్చపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనుల, ప్రారంభోత్సవాలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతుబంధు సాయం రైతులకు అందుతుందా అని సూటిగా ప్రశ్నించారు.

మల్లాయపల్లి మారెమ్మ గడ్డలో రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకున్నాం. దశల వారీగా మోరీల నిర్మాణాలు చేయిస్తానని భరోసా ఇచ్చారు. లచ్చపేటకు రెండు రోజుల్లో రూ.2కోట్లు మంజూరు చేస్తాని తెలిపారు.

- Advertisement -