క్యాన్స‌ర్ రోగులకు మంత్రి హరీష్ రావు భరోసా..

60
- Advertisement -

ఈరోజు వ‌ర‌ల్డ్ క్యాన్స‌ర్ డే సంద‌ర్భంగా ఎంఎన్‌జే క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో మంత్రి హ‌రీష్‌ రావు సీటీ స్కాన్‌, డెంటల్ ఎక్స్‌రే ఓపీజీ, పెషేంట్ అటెండెన్సీ భ‌వ‌నంతో పాటు మొబైల్ స్క్రీనింగ్ వాహ‌నాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్‌ రావు ఆసుపత్రిలో ప్రతీ వార్డును పరిశీలించారు. అక్కడి రోగులతో ముచ్చటించారు. ఆరోగ్యం ఎలా ఉంది.. మందులు సరిగా వేసుకుంటున్నారా..వైద్య సేవలు మంచిగా అందుతున్నాయా అని రోగులను ప్రశ్నించారు. భోజన వసతులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఏమీ భయపడ వద్దని, క్యాన్సర్ నయమవుతుందని, ప్రభుత్వం మీకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తుందని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.

- Advertisement -