బీజేపీ కుడితిలో పడ్డ ఎలుకల మారింది- మంత్రి హరీశ్‌

206
harish
- Advertisement -

సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో యువజన బహిరంగ సభ, భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు యువకులు. ఈ కార్య క్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌.. పెద్ద సంఖ్యలో యువకులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి బీజేపీ మోసం చేసింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. రాదనుకున్న తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ ది. ఆనాడు విద్యార్థి మిత్రుల చావులకు ఈ కాంగ్రెస్ కారణం కాదా ?. డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ వెనక్కి పోతే మేమంతా రాజీనామా చేస్తే, బీజేపీ కిషన్ రెడ్డి రాజీనామా చేశాడా ? అని మంత్రి విమర్శించారు. నీళ్లు, నిధులు, నియమకాలు మన నినాదం. అలాగే ఈ రోజు కాళేశ్వరం ద్వారా సాగు మీరు తెచ్చుకుంటున్నాం. మన నిధులు దక్కాయి కాబట్టే రైతు బంధు, రైతు బీమా వచ్చాయి. అదేవిధంగా తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు అని చెప్పాము. ఇప్పటికే 1,24,990 ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి తెలిపారు.కేసీఆర్ పారిశ్రామిక విధానంతో 8 వేల పరిశ్రమలు వచ్చాయి. బీజేపీ వస్తే నల్లధనం తెస్తామని చెప్పారు.. ప్రతి ఎక్కౌంట్ లో 15 లక్షలు వేస్తామన్నారు. వచ్చాయా ? వారు వస్తే ఏటా కోటి ఉద్యోగాలన్నారు.. ఇచ్చారా ? డి మానిటైసెషన్‌తో ఉన్న ఉద్యోగాలు ఉడబికారు మంత్రి మండిపడ్డారు.

నిజామాబాద్ లో అర్వింద్ కుమార్ తాను గెలిస్తే… పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. వచ్చిందా పసుపు బోర్డు. బీహార్‌లో బీజేపీ, ఢిల్లీలో బీజేపీ ఉంటేనే అభివృద్ధి జరుగుతాదాని మోడీ అంటున్నాడు. గట్లనే హైదరాబాద్‌లో కారు ఉంది, దుబ్బాకలో కూడా కారు ఉంటే అభివృద్ధి జరుగుతది. ఇక కాంగ్రెస్ అంటేనే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు. ముత్యంరెడ్డి బాగా అభివృద్ధి చేశాడని అంటున్న కాంగ్రెస్, 2018లో ఎందుకు టిక్కెట్టు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయికాడ మీటర్లు, టిఆర్ఎస్ అంటే 24 గంటల కరెంట్. కన్న తండ్రి క్షోభకు కారణమైన శ్రీనివాస్ రెడ్ది, ప్రజలకేం సేవ చేస్తాడు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు రావాల్సిన ప్రతి పైసా ఇప్పిస్తాం. ఆలస్యం కావడానికి కాంగ్రెస్ కేసులు వేయడమే? మంత్రి స్పష్టం చేశారు. దేశంలో బీహార్, ఉత్తరాఖండ్, యూపి రాష్ట్రాల్లో కంటే నిరుద్యోగిత సగానికి సగం తక్కువ.. తెలంగాణలో కేవలం 3.6 శతమే. బీజేపీ కుడితిలో పడ్డ ఎలుకల మారింది.. డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవ చేశారు.

ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాకలో గెలిచేది ఖాయం. బీజేపీ, కాంగ్రెస్ లు వెంటిలేటర్ మీద ఉన్నాయని అన్నారు. దుబ్బకకు ఎప్పుడైనా కిషన్ రెడ్ది వచ్చారా ? నిన్నటి నుంచి బీజేపీ కొత్త నాటకం మొదలు పెట్టింది. పైసలు పట్టుకుంటున్నరు.. ఇంకా పంపించాలని అమిత్ షాను అడుగుతున్నరు. ఆరడుగుల పిచ్చోడు ఇష్టమైనట్లు మాట్లాడుతున్నారు. స్టాంప్ పేపర్ మీద హామీ ఇచ్చి, రైతులను మోసం చేసిన ఘనత ఎంపీ అరవింద్ ది. అయ్యా టిఆర్ఎస్‌లో ఉండి బీజేపీలో ఉన్న కొడుకుకు సపోర్ట్ చేస్తున్నాడు. ప్రజలను మోసం చేసిన ఇద్దరు కూడా రాజీనామా చేయాలని ఎంపీ తెలిపారు.

టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత మాట్లాడుతూ.. రామలింగారెడ్డి దుబ్బాకకు ఎన్నో సేవలు అందించారు, ఎంతో అభివృద్ధి చేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తా. సిద్దిపేట వారికి దుబ్బాకతో పని లేదు కానీ, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ లీడర్లకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ముఖ్యమైన నియోజకవర్గం దుబ్బాక, సీఎం ఆశీస్సులతో, హరీశ్ రావు సహకారంతో దుబ్బాకలో అభివృద్ధి చేస్తాం. సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు, అన్ని చేయగల సమర్థత ఉంది. కన్నతల్లి లాగా నియోజకవర్గ యువతను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా అని టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత పేర్కొన్నారు.

- Advertisement -