ప్రభుత్వానికి పేరు రావద్దని ప్రతిపక్షాల కుట్ర: హరీష్‌

214
harish
- Advertisement -

సిద్దిపేట లోని మంత్రి హరీష్ రావు నివాసంలో దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలంలోని మలన్న సాగర్ ముంఫు గ్రామాలు పల్లె పహాడ్, వేములఘాట్, రాంపూర్ గ్రామాల నుండి బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 400 మంది కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో మంత్రి హరీష్ రావు సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కామెంట్స్‌…

  • -ప్రతిపక్షాలు మనతో అడుకొని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు.
  • -ప్రతిపక్షాలు మనం బ్రతికుండగా ప్రాజెక్ట్ లు కావు నీళ్లు రావు అని అనేవారు.
  • -రైతుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటారు అని విమర్శించేవారు.
  • -ప్రభుత్వం పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది.
  • -ప్రభుత్వానికి పేరు రావద్దని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి.
  • -ఎవరు అవునన్నా, కాదన్న ఇంకా మూడు ఎంద్లు టీఅర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.
  • -టీఅర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తుంది.
  • -ఒక్కో ఇల్లు విలువ 20 లక్షల రూపాయలు ఉంటుంది.
  • -కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఎలాంటి సహాయం అందించమో మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ఇస్తాం.
  • -కాంగ్రెస్, బీజేపి పార్టీల చేతిలో నెత్తి లేదు, కత్తివ్ లేదు.
  • -అర్హులైన అందరికీ న్యాయం చేస్తాం.
  • -ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిన చివరకు ఎం సాధించారు.
  • -మీ నమ్మకాన్ని నిలబెడుతా, మీకు న్యాయం చేస్తాం.
  • -త్వరలోనే ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తాం.
  • -ప్రాజెక్టు కడుతున్నాం అంటే ముంపు గ్రామంగా ముందు ఉంది రాంపూర్ గ్రామం.
  • -మీ త్యాగం గొప్పది.. మిమ్మల్ని ప్రభుత్వం ఎప్పుడు కడుపులో పెట్టుకొని కపాడుకుంటుంది.
  • -నాడు ప్రాజెక్టు ముందు కొచ్చారు..నేడు టిఆర్ఎస్‌ పార్టీ గెలుపుకు ముందు ఉంటున్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని మంత్రి హరీష్‌ అన్నారు.
- Advertisement -