మీ త్యాగం వెలకట్ట లేనిది: మంత్రి హరీష్

312
harish rao
- Advertisement -

దుబ్బాక నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఆదివారం మంత్రి హరీష్ రావు గజ్వెల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు తొగుట మండల్ లక్ష్మాపూర్ గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో భాగంగా లక్ష్మా పూర్ గ్రామ ప్రజలు గజ్వేల్ లోని సంఘపుర్ వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇడ్ల కాలనీలో ఈరోజు మంత్రి హరీష్ రావుకి ఏకగ్రీవ తీర్మానం పత్రాన్ని అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. గోదావరి జలాల కోసం మేము ముందు ఉంటాం అని అప్పుడు ముందు కొచ్చింది లక్ష్మపూర్. నేడు టిఆరఎస్ పార్టీ గెలుపు కోసం ముందు ఉన్నది లక్ష్మపూర్ అని కొనియాడారు. నాటి మీ త్యాగం.. నేటి మీ అభిమానము ఎన్నడూ మరవం. గులాబీ పార్టీ గుండెల్లో ఉంటారు..మీ త్యాగం వెలకట్ట లేనీదని మంత్రి అన్నారు.

ప్రతిపక్షాలు మనతో అడుకొని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. ప్రతిపక్షాలు మనం బ్రతికుండగా ప్రాజెక్ట్ లు కావు నీళ్లు రావు అని అనేవారు. రైతుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటారు అని విమర్శించేవారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది. ప్రభుత్వానికి పేరు రావద్దని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని మంత్రి విమర్శిచారు.

ఎవరు అవునన్నా, కాదన్న ఇంకా మూడు ఎండ్లు టీఅర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. టీఅర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తుంది. ఒక్కో ఇల్లు విలువ 20 లక్షల రూపాయలు ఉంటుంది. కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఎలాంటి సహాయం అందించమో మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ఇస్తాం అని మంత్రి హామీ ఇచ్చారు.

కాంగ్రెస్, బీజేపి పార్టీల చేతిలో నెత్తి లేదు, కత్తి లేదు. అర్హులైన అందరికీ న్యాయం చేస్తాం. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసిన చివరకు ఎం సాధించారు.మీ నమ్మకాన్ని నిలబెడుతా, మీకు న్యాయం చేస్తాం. త్వరలోనే ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తాం. ప్రాజెక్టు కడుతున్నాం అంటే ముంపు గ్రామంగా ముందు ఉంది రాంపూర్ గ్రామం అని మంత్రి గుర్తు చేశారు.

మీ త్యాగం గొప్పది.. మిమ్మల్ని ప్రభుత్వం ఎప్పుడు కడుపులో పెట్టుకొని కపాడుకుంటుంది.. నాడు ప్రాజెక్టు ముందు కొచ్చారు. నేడు టి ఆర్ పార్టీ గెలుపుకు ముందు ఉంటున్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని మంత్రి హరీష్‌ అన్నారు.

- Advertisement -