కిషన్‌ రెడ్డిపై మంత్రి హరీష్‌ రావు ఫైర్..

137
minister hariash
- Advertisement -

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారు. ఆశీర్వాద యాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తూ అన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ది జరగడం లేదని, ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదనేటటువంటి మాటలు కిషన్‌ రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై అవగాహన లేకనో.. లేదా రాజకీయాల కోసమో కేంద్ర మంత్రి ఈ మాటలు మాట్లాడుతున్నారని మంత్రి తెలిపారు.

రాష్ట్రానికి రావలిసిన ట్రైబల్‌ యూనివర్సిటీ గురించి కేంద్ర మంత్రి మాట్లాడితే బాగుంటుంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమయ్యిందో ప్రజలకు చెబితే సంతోషిస్తాం. ఐటీఐఆర్‌ను ఎందుకు రద్దు చేశారో, దాన్ని పునరుద్దరణ గురించి మాట్లా సబబుగా ఉంటుందని హరీష్‌రావు అన్నారు. తాము దేశాన్ని వృద్ధి చేశామని మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి ఏరంగంలో వృద్ధి చేశారో చెబితే సంతోషిస్తామన్నారు. పెట్రోల్‌ రేట్లను పెంచడంలో మాత్రం దేశాన్ని వృద్ధి చేశారని మంత్రి హరీష్‌ ఎద్దేవ చేశారు.

- Advertisement -