రాష్ట్రానికి ఐజీఎస్టీ కింద 2,638 కోట్లు చెలించాలి: మంత్రి హరీశ్

193
harish-rao
- Advertisement -

ఎంసీహెచ్ ఆర్డీలో ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో నేడు మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐజీఎస్టీ సెటిల్మెంట్ పై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ సభ్యులైన ఢిల్లీ, చత్తీస్ ఘడ్, పంజాబ్, తమిళనాడు, ఓడిస్సా ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సభ్యుడిగా మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీ మొత్తంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. రాష్ట్రానికి ఎంత ఐజీఎస్టీ రావాల్సి ఉందన్న విషయంపై మాకు స్పష్టత ఉంది అన్నారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 25 వేల 58 కోట్లు ఐజీఎస్టీ మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ జీఎస్టీ కౌన్సిల్ కు సిఫారసు చేయాలి. తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన 2638 కోట్లు వెంటనే విడుదల చేయాలని మంత్రి తెలిపారు.

గతంలో ఈ మొత్తాన్ని 25 వేల 58 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్‌లో నిబంధలకు విరుద్ధంగా జమ చేశారన్న విషయాన్ని పార్లమెంట్‌లో కాగ్ ఎత్తి చూపిన విషయాన్ని ఈ సమావేశంల మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు. కాగ్ సైతం ఈ విషయంలో తప్పు పట్టింది కాబట్టి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని ఇవ్వాలన్న సిఫారసును గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ నెల ఐదో తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ ఎజెండాలో ఉండేలా చూడాలని కోరారు.

అందుకు ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కన్వీనర్, బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడీ అంగీకారం తెలుపుతూ, రాష్ట్రాలకు ఐజీఎస్టీ మొత్తం ఇవ్వాలన్న సిఫారసును ఈ రోజే తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. 2017-2018లో, తిరిగి 2018-2019లో ఇదే తప్పు జరిగిందన్న విషయాన్ని కాగ్ మొన్న పార్లమెంట్‌లో బహిర్గతం చేసిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

208-19లో 13 వేల 944 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని కేంద్రం మళ్లీ కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేయడాన్ని కాగ్ మరో మారు తప్పు పట్టిందన్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఆయన తెలంగాణకు ఇందులో 210 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. ఐజీఎస్టీలో సెటిల్మెంట్ బేస్డ్ ఆన్ ఆన్వల్ రిటర్న్స్ కింద రాష్ట్రానికి మరో వెయి కోట్లు రావాల్సి ఉందన్న మంత్రి హరీశ్ రావు జీఎస్టీ కౌన్సిల్ ఈ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్య, పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, ఆర్థిక, వాణిజ్య, పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -