కరోనా వ్యాప్తిపై మంత్రి ఈటల సమీక్ష.. కీలక ఆదేశాలు..

194
- Advertisement -

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టర్శరీ కేర్ హాస్పిటల్స్, టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ సెక్రెటరీ రీజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది గంభీరమైన సమయం..రిలాక్స్ కావొద్దు..మరో సారి యుద్ద వాతావరణంలో పని చేద్దాం. కరోనా వైరస్ వల్ల మరణాలు జరగకుండా చూద్దాం అని అన్ని ఆసుపత్రుల సుపెరెంటెండెంట్స్ ని మంత్రి కోరారు.

అన్ని ఆసుపత్రుల్లో పీపీఈ కిట్స్, రిమెడ్స్విర్ ఇంజెక్షన్లు, ఎన్‌ 95 మాస్క్ లు, లిక్విడ్ ఆక్సిజన్ టాంక్ లు, బల్క్ సిలెండర్ లు, టాబ్లెట్స్, డాక్టర్ లు, సిబ్బంది, బెడ్స్ కొరత లేకుండా చూడాలి. ఎంత మంది సిబ్బంది అవసరం అయినా తాత్కాలిక పద్దతిలో తీసుకోండి అని సూచించారు.

అనంతరం మంత్రి ఈటల జిల్లా వైద్య అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ కాన్ఫరెన్స్ లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. డీఎం అండ్‌ హెచ్‌ఓ లతో మంత్రి మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తిని అరికట్టడం గ్రామస్థాయిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గ్రామాల్లో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరినీ, ప్రతి రోజూ పరిశీలన చేయండి. వైద్య ఆరోగ్య శాఖ లో పని చేస్తున్న వారందరూ సెలవలు పెట్టకండి అని మంత్రి సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం కూడా వాక్సిన్ వేయాలని ఆదేశాలు ఉన్నాయి.. కాబట్టి అందరూ అన్ని రోజులు పని చేయండి. ప్రజా జీవనం యదావిధంగా కొనసాగిస్తూనే కరోనా నియంత్రణ చేయాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని మంత్రి ఈటల ఆదేశించారు.

వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ మాట్లాడుతూ.. వాక్సిన్ కొరత లేదు, అందరికీ వాక్సిన్ అందుతుంది. 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వాక్సిన్ సెంటర్ కి పంపించాలి. RTPCR పరీక్షల సంఖ్య పెంచాలి. ప్రతి జిల్లాకు ఇచ్చిన టార్గెట్ మేరకు చేయాలన్నారు.

- Advertisement -