ఖమ్మంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి ఈటల..

211
Etela Rajender
- Advertisement -

ఖమ్మం జిల్లా లో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు.. ఖమ్మం ప్రధాన ఆసుపత్రి లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి కోవిడ్ టెస్టింగు ల్యాబ్ ను , 10 పడకల అత్యాధునిక యూరాలజీ ఐసీయూ ను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంబించారు.

ఎంపీ నామా నాగేశ్వర రావు , సుఢా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ హాజరయ్యారు.. ఆసుపత్రి పరిసరాలు పరిశీలించి, రోగులకు అందుతున్న చికిత్సలపై మంత్రి ఈటల ఆరా తీశారు. కరోనా చికిత్సల పైనా మంత్రులు ఈటల , పువ్వాడ సమాచారం తెలుసుకున్నారు.తర్వాత మమత జనరల్ హాస్పిటల్ లో కోవిడ్ టెస్టింగు ల్యాబ్ ను , ఐసోలేషన్ వార్డు ను ప్రారంబించి , కరోనా బాధితులకు అందుబాటులోకి తీసుకోచ్చారు మంత్రి ఈటల.

- Advertisement -