- Advertisement -
దేశంలోనే వరంగల్ పత్తి నాణ్యతకు మారుపేరు అన్నారు పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జాయింట్ కలెక్టర్ దయానంద్, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుల వద్ద రైతులు రోజుల తరబడి వేచి కూడకుండా సీసీఐకి అదనపు ఉద్యోగులను నియమిస్తామన్నారు. ప్రతి రైతు పత్తిని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు.
తేమశాతం ఎక్కువ ఉన్నాగాని దానికి సరిపడా ధర కల్పించి కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి రైతు పత్తి మార్కెట్లో కొనుగోలు చేసే విదంగా కృషి చేస్తామని చెప్పారు. క్వింటాల్ పత్తికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ. 5550 ప్రకటించనట్లు తెలిపారు.
- Advertisement -