బాలవికాస సంస్థ కృషి అభినందనీయం: ఎర్రబెల్లి

130
errabelli
- Advertisement -

కరోనా కష్టకాలంలో చ‌దువుల‌కు ఎవ‌రూ దూరం కావొద్దని బాల వికాస సంస్థ ట్యాబ్ లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం కంటాయపాలెం ప్రభుత్వ హైస్కూల్‌లో బాలవికాస ఆధ్వర్యంలో విద్యార్థులకు 40 ట్యాబ్‌లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి….కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. క‌రోనా వల్ల డిజిట‌ల్,ఆన్ లైన్ క్లాసులు వ‌చ్చేశాయి. ఇప్పుడు గురువు క‌న‌బ‌డ‌కుండానే చ‌దువు నేర్చుకునే విధంగా పరిస్థితులు మారాయన్నారు.

కరోనా కారణంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. కేవలం తెలంగాణలోనే సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. అలాగే తొర్రూరు అతిథి గృహంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్‌లు అందజేశారు.

- Advertisement -