యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు…

86
errabelli
- Advertisement -

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు మా ఇలవేల్పు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించిందన్నారు.

ఈ సందర్భంగా స్వామివారి కి పూజలు నిర్వహించడం జరిగింది. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారు. గతంలో యాదాద్రి కి వచ్చిన వారు ఇప్పుడు వచ్చి చుస్తే యాదాద్రి కేనా వచ్చింది అన్నంత అభివృద్ధి జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు ఈ ఆలయ ఉద్ఘాటన చేయనున్నారని తెలిపారు.

దేశ విదేశాల నుంచి ప్రధానులు, ముఖ్యమంత్రులు, పీఠాధిపతులు హాజరుకానున్నారు. అని చెప్పారు. మహి మాన్వితమైన ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులకు ఈ ఆలయ ప్రాంగణంలోనే సకల సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. సీఎం కెసిఆర్ దార్శనికత తో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి చెప్పారు. ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నాను అని మంత్రి తెలిపారు.

- Advertisement -