ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఎర్రబెల్లి..

103
errabelli
- Advertisement -

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఏపీ పర్యటనలో భాగంగా అమ్మవారిని దర్శించుకోగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

అంతకముందు గుంటూరు జిల్లా కొలీఫర్ మండలం మున్నంగి గ్రామంలో తన మిత్రుడు బొంతు శ్రీనివాస్ రెడ్డి తండ్రి బాపిరెడ్డి ఇటీవల మృతిచెందగా.. మున్నంగి గ్రామంలో బాపిరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి, శ్రీనివాస్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

- Advertisement -