కార్మికుల పక్షపాతి…నాయిని: మంత్రి ఎర్రబెల్లి

169
dayakar rao
- Advertisement -

తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నాయిని నర్సింహారెడ్డి కార్మికుల పక్షపాతి….తన జీవితాంతం కార్మికుల అభివృద్ధి కోసమే పాటుపడ్డారని గుర్తుచేశారు.

నాయిని నిబద్ధత గల నాయకుడు…. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి సీఎం కేసీఅర్ వెంట నడిచిన వ్యక్తి కార్మికుల కొరకు తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర మొదటి హోం మంత్రిగా పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టారు..అందరినీ తమ్మి..బాగున్నావా… అంటూ పలకరించే ఎటువంటి కల్మషం లేని వ్యక్తి నాయకుని మృతి కార్మిక లోకానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు నాయిని నర్సింహారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను..వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియచేస్తున్నానని వెల్లడించారు.

- Advertisement -