రోశయ్య లేని లోటు తీర్చలేనిది- మంత్రి ఎర్రబెల్లి

118
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. వారు మంత్రిగా, ముఖ్య మంత్రిగా, గవర్నర్ గా అనేక పదవులు అలంకరించారు. మంచి మాట కారి అయిన ఆయన, తనదైన నుడికారం, వ్యంగమైన వ్యాఖ్యలతో అందరి మన్ననలు పొందారు. సుదీర్ఘంగా వ్యక్తిగత, రాజకీయ, సంపూర్ణ జీవితాన్ని అనుభవించారు. వారు లేని లోటు తీర్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

- Advertisement -