సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

143
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా అక్టోబరు30న చండూరు మండలం బంగారు గడ్డలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ జరగనుంది. చండూరు సభలో మునుగోడులో తీసుకున్న అభివృద్ధి పనులను వివరించనున్నారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఓటర్లను సీఎం కోరనున్నారు.

రాష్ట్ర పంచాయతీరారజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం బహిరంగసభ ఇన్‌చార్జి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి సభా ప్రాంగణం అంతా తిరిగి చూశారు. ఈ సందర్భంగా మంత్రి వెంబడి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, సీనియర్ నాయకులు కిషన్ రావు తదితర టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై ట్రోల్స్

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. రెండో ఆడియో లీక్

అమిత్ షాతో ప్రమాణం చేయించగలరా?

- Advertisement -