మీకు మేము అండగా ఉంటాం- మంత్రి

167
- Advertisement -

ప్రోగ్రెసివ్ రికగ్నయిజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర తొర్రూరు డివిజన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి యూనియన్ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సభ్యులు ఆయన గెలుపు కోసం పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముందుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం మీరంతా ఒక్కటిగా అవడం, సంతోషించదగ్గ విషయం. గతంలోనూ 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన విషయం మరచిపోవద్దు. ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. పీఆర్‌సీ విషయంలో ఆందోళన వద్దు. మంచి ఫిట్ మెంట్ ఇవ్వడానికి సీఎం కెసిఆర్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించండి.. విశ్లేషించండి. పని చేసే ప్రభుత్వం ఏమి చేస్తున్నది. మిగతా వాళ్ళు చేసిందేంటి? ఆలోచించండి అన్నారు.

అప్పుడు, ఇప్పుడు గ్రామాలు ఎలా ఉన్నాయి? కరెంటు ఎలా ఉంది? చూడండి అని మంత్రి కోరారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది. చెప్పింది చేస్తున్నాం. చెప్పంది కూడా చేసిందన్నారు. నిరుద్యోగులకు అండగా ఉన్నాం. వాళ్ళకి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం.. ఉద్యమంలో టీచర్స్ పాత్ర విస్మరించ లేనిది. మీరు ఇప్పుడు మద్దతుగా ఉన్నారు. మీకు మేము అండగా ఉంటాం. ఎన్నికలు ముగిసిన వెంటనే మీరు శుభ వార్త వింటారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా సీఎం కేసీఆర్ ఒక మంచి వార్త చెప్పనున్నారని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయు నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -