మానవత్వం చాటుకున్న మంత్రి దయన్న..

115
dayakar rao errabelli
- Advertisement -

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై, ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఓ గిరిజన యువకుడిని తన భద్రతా సిబ్బందిని, వారి వాహనాన్ని ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి, వైద్య చికిత్స కోసం దగ్గర ఉండి హాస్పిటల్ కి పంపించారు.

Trs పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంత్రి, పాలకుర్తి నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు. పాలకుర్తి కార్యక్రమం ముగించుకుని, రాయపర్తి కి వెళుతుండగా, దారిలో వస్రా0 తండా వద్ద రహదారి పై గాయపడిన లాకవత్ చంటి ని పడుకోబెట్టి, రోధిస్తు, వాహనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఆ దారిలో వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే తన వాహనాన్ని ఆపారు. వారి వద్దకు వెళ్లి, జరిగిన ప్రమాద ఘటన తెలుసుకున్నారు.

ద్విచక్ర వాహనం అదుపు తప్పి గాయాల పలైనట్లు వారు చెప్పారు. గాయపడిన ఆ యువకుడిని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వెంటనే, తన భద్రతా సిబ్బంది వాహనంలో గాయపడిన ఆ వ్యక్తిని ఎక్కించి, కొంత ఆర్థిక సహాయం అందించారు. తన సిబ్బందిని వారి వెంట పంపించారు. చికిత్స చేయించి రావాల్సిందిగా ఆదేశించారు. దీంతో, ఆ గిరిజనులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పన్నులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే దయన్న దాతృత్వం పట్ల పలువురు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -