కార్యకర్త మృతికి కన్నీరు పెట్టుకున్న ఎర్రబెల్లి..

236
- Advertisement -

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తన అనుచరుడ్ని కోల్పోవడం పట్ల తీవ్ర విషాదానికి గురయ్యారు. రాయపర్తి మండలం ఫణ్యానాయక్ తండాలోని భూక్యా విజయ్ కుమార్ కరెంట్ షాక్‌తో మరణించాడు. విజయ్ కుమార్ ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. విజయ్ కుమార్ ఇంటికి విద్యుత్ సరఫరా అయ్యే వైరును తాకడంతో ప్రాణాలు కోల్పోయాడు.

minister errabelli dayakar rao

కాగా పదేళ్ల పాటు తన వెన్నంటి నడిచిన అనుచరుడి ఆకస్మిక మృతితో మంత్రి ఎర్రబెల్లి కంటతడి పెట్టారు. మరణవార్త విని ఆస్పత్రి వద్దకు హుటాహుటిన తరలివచ్చారు. తన అనుచరుడి మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. మంత్రి దయాకర్ రావు కన్నీటి పర్యంతం కావడంతో ఆసుపత్రి ఆవరణలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ఇతర నాయకులు, కార్యకర్తలు కూడా కంటతడి పెట్టారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో శనివారం (జూన్ 8) ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

minister errabelli dayakar rao

విజయ్ పార్థీవ దేహానికి మంత్రి దయాకర్ రావు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. దయాకర్‌రావు సతీమణి ఉషాదయాకర్‌ రావు కూడా విజయ్ మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. శనివారం సాయంత్రం ఫన్యానాయక్ తండాలో జరిగిన విజయ్ అంత్యక్రియల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -