అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ: ఎర్రబెల్లి

34
erranbelli
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అధికారులు, ఉద్యోగులు చేస్తున్న కృషి గణనీయమైనదని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభిృద్ధి, గ్రామీణ మంచి నీటి సఫర శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లతో కలిసి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 2022 సంవత్సరపు డైరీ, క్యాలండర్ లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో అన్ని విధాలుగా తెలంగాణ అణిచివేతకు గురైన0దని అన్నారు. ఇప్పుడూ ముఖ్య మంత్రి కేసీఆర్ గారు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ర్టంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటూన్నారని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో అన్ని వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయం కేంద్ర ప్రభుత్వ వివిధ అవార్డుల ద్వారా గుర్తించిందని గుర్తుకు చేశారు. ఉద్యోగులకు పిఆర్సి, పదోన్నతులు, ఇతర ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని టిజీఓల కు ఎలాంటి సహాయం ఐనా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో అన్ని విధాలుగా విద్యా, ఉపాధి, నిధులు, నియామకాలలో వారికి అనుకూలంగా పనులు చేసుకుంటూ మనకు తీవ్ర నష్టం కల్గీంచారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఐనా తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పీఆర్సీ, ఒక్కేసారి నాలుబై వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం చాల గొప్ప విషయం అని చెప్పారు. ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఐతే బాగుండు అని చెప్పుకుంటున్నారని గుర్తుకు చేశారు, తెలంగాణ గెజిటెడ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం లో భాగంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పని చేసి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. ఎలాంటి సమస్యలు, ఉన్న అన్ని విషయాల పట్ల ప్రభత్వం శ్రద్ద తీసుకుంటుందని చెప్పారు. టిజిఓ లకు, టిఎన్జీఓలకు ప్రతేక్య అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, ఆర్డిఓ వాసు చంద్ర, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు, రూరల్ జిల్లా అధ్యక్షులు మురళీధర్ రెడ్డి గారు, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఫణి కుమార్, రాజేష్, రత్న వీరాచారి, సురేష్ కుమార్, నారాయణ, కోశాధికారి, వెంకటేశ్వర్లు, హసదుద్దీన్, కిరణ్ కుమార్, నీరజ మాధవి, అరుణ, సుమలత, విజయ నిర్మల, మరియు టిజీఓ జిల్లా అధికారుల విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్ గా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హరి ప్రసాద్, డా. రాజేష్, మాధవ రెడ్డి, శేషు, రఘుపతి రెడ్డి మరియు సుధీర్ కుమార్, 6 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అంజద్ అలీ, శామ్యూల్, వెంకయ్య, రఫీ, ఆంజనేయులు, దామోదర స్వామి పి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరైనారు. అంతకు క్రితం టి.జి.ఓ కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు.

- Advertisement -