చందూలాల్ సేవలు చిరస్మరణీయం: ఎర్రబెల్లి

40
chandulal
- Advertisement -

బతికినన్నాళ్లు ప్రజల బాగుకోసం పరితపించిన గొప్పనాయకుడు చందూలాల్ అని కొనియాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రజాసేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న గొప్పనాయకుడన్నారు. మాజీ మంత్రి చందూలాల్ సంవత్సరీకం సందర్భంగా ములుగు జిల్లా జగ్గన్నపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఎర్రబెల్లి.

చందూలాల్ చిత్రపటానికి నివాళి అర్పించిన ఎర్రబెల్లి… కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. చందూలాల్ గారి తో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

- Advertisement -