కొత్త‌ప‌ల్లి వాసుదేవ‌రావు మృతికి మంత్రి ఎర్ర‌బెల్లి సంతాపం.

138
dayakarrao
- Advertisement -

ప్ర‌త్యేక తెలంగాణ పోరాట సిద్దాంత‌క‌ర్త‌, స్వ‌ర్గీయ ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సోద‌రుడు కొత్త‌ప‌ల్లి వాసుదేవ‌రావు మృతికి రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సంతాపం తెలిపారు. అహ‌ర్నిశలు ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం కృషిచేసిన మ‌హానీయుడు స్వ‌ర్గీయ ప్రొ. కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ సార్‌కు చేదోడు వాదోడుగా ఉండి ప్రొత్స‌హించిన మ‌హానీయుడు వాసుదేవ‌రావు అని కొనియాడారు. వాసుదేవ‌రావు కుటుంబ‌స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాడ సానుభూతి, సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

- Advertisement -