అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి మృతిపట్ల ఎర్రబెల్లి సంతాపం..

188
errabelli
- Advertisement -

జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి మృతికి సంతాపం తెలిపారు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి….వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కాలం విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందిన వ్యక్తి దక్షిణామూర్తి అని కొనియాడారు.

ఆయన కరోనాతో చనిపోవడం చాలా బాధాకరం అని…మేడారం జాతర స్పెషల్ ఆఫీసర్ గా మంచి అనుభవం ఉన్న పోలీస్ అధికారి అని మంచి గుర్తింపు ఉందన్నారు. వరంగల్ ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేయడం ద్వారా ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు.

ఎస్సై గా పోలీస్ శాఖలో చేరి సీఐ, డి ఎస్పీ,ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొందారు అంటే ఆయన ఎంత బాధ్యతగా పనిచేసేవారో అర్ధం చేసుకోవచ్చన్నారు. దక్షిణామూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని…వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు ఎర్రబెల్లి.

- Advertisement -