అంటువ్యాధులు ప్రభలకుండా జాగ్రత్త వహించాలి:ఎర్రబెల్లి

225
errabelli
- Advertisement -

ప్ర‌తి ఆదివారం ప‌ది గంట‌ల‌కు, ప‌ది నిమిషాలు కార్య‌క్ర‌మాన్ని ఒక ఉద్య‌మంగా నిర్వహించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఐటీ, పరిశ్రమలు, పుర‌ పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావు ఇచ్చిన పిలుపు మేర‌కు ప్ర‌తి ఆదివారం ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాలు కార్య‌క్ర‌మంలో భాగంగా పర్వతగిరిలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి పారిశుద్ధ్య ప‌నులు చేశారు ఎర్రబెల్లి.

ఇంట్లో మొక్కలకు పాదు తీయడం,మొక్కలకు నీళ్ళు పట్టడం .ఇంట్లో నీటి నిలువ‌లు లేకుండా చేశారు. నీటి నిలువ‌లున్న‌చోట్ల నీటిని తీసేసి, వాటిని ప‌రిశుభ్ర ప‌ర‌చారు. మూత‌లు ఉండేలా చూశారు. చెత్తా చెదారం తీసేసి దోమ‌లు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి …ఈ సీజన్ లో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇప్పటికే… కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలం అవుతుందని…దోమ‌ల నివార‌ణ‌తో మ‌లేరియా, డెంగీ వంటి అనేక అంటు, సీజనల్ వ్యాధుల‌ను రాకుండా నివారించ‌వ‌చ్చన్నారు. ఇంటితోపాటు, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని రోగ ర‌హితంగా ఉంచ‌వ‌చ్చన్నారు.

ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప‌చ్చ‌ద‌నం-పరిశుభ్ర‌త‌, ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, స్వ‌చ్ఛ హైద‌రాబాద్,స్వచ్ఛ తెలంగాణ వంటి అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టిందని…ఆయా కార్యక్రమాల అమలు వల్ల రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌తి ఆదివారం, ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాలు కార్యక్ర‌మం కూడా ఇందుకు దోహ‌ద ప‌డుతుందన్నారు.ప్రత్యేక పారిశుద్ధ్యం, ప్రతి రోజూ నిర్వహిస్తున్న పారిశుద్ధ్యం కార్యక్రమాలు కూడా పల్లెలను ప్రశాంతంగా ఉంచుతాయని…ఇక ప్రభుత్వం నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు.

- Advertisement -